హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాజకీయాలు మానేసి జ్యోతిషం నేర్చుకున్నావా? అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను ఎద్దేవాచేశారు. సీఎం కేసీఆర్ జాతకం బ్రహ్మాండంగా ఉన్నదని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో ఎస్సీ, ఎస్టీ మేధావుల ఫోరంతో వినోద్ భేటీ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు అనుసరిస్తున్న తీరును ఈ సందర్భంగా తీవ్రంగా ఆక్షేపించారు. బండి సంజయ్ ఇప్పటికే నవ్వులపాలు అవుతున్నారని, మన ఊరు మన బడి కార్యక్రమంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజకీయాలు మానుకొని జాతకాలు చెప్తూ.. సమాజంలో నవ్వులపాలు కావద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం యజ్ఞంలా చేపట్టిన కార్యక్రమం.. మన ఊరు – మన బడి అని చెప్పారు. సూళ్లలో ఇంగ్లిష్ మీడియం బోధనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శలుచేయడంపై వినోద్ స్పందించారు. మన ఊరు – మన బడి, ఇంగ్లిష్ మీడియంలో బోధన రాష్ట్ర ప్రభుత్వ వినూత్న కార్యక్రమాలని చెప్పారు. ప్రైవేటు సూల్స్ నుంచి డబ్బులు వసూలు కోసం ఇంగ్లిష్ మీడియం బోధన అంటూ బండి తలాతోకా లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ అనాలోచిత వ్యాఖ్యలను వారి కుటుంబ సభ్యులే ఒప్పుకోరని అన్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రభుత్వ సూళ్ల దశ మారనున్నదని స్పష్టంచేశారు. విపక్ష నాయకులు సంజయ్, రేవంత్.. ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిని విమర్శించడమే పనిగా పెట్టుకొన్నారని ధ్వజమెత్తారు. విపక్ష నాయకులుగా నిర్మాణాత్మక సూచనలు చేయాలని హితవు పలికారు. నీళ్లు, విద్యుత్తు పుషలంగా అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం విద్యా, వైద్యం ప్రధాన అంశాలని వినోద్ వివరించారు. ఈ సమావేశంలో తెలంగాణ ట్రైబల్ మేధావుల ఫోరం అధ్యక్షులు డాక్టర్ ఎం ధనంజయ్నాయక్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీ హరిచరణ్, ఉపాధ్యక్షుడు డాక్టర్ బీ రమణ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ సాలర్ డాక్టర్ రవితేజ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎస్సీ మేధావుల ఫోరం ప్రెసిడెంట్ ఆరేపల్లి రాజేందర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ మేధావుల ఫోరం ప్రతినిధులు సంపూర్ణ మద్దతు పలికారు.