హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బడ్జెట్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి రూ.12 వేల కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కంటే రూ.1,000 కోట్లు ఎక్కువ. వంద శాతం సబ్సిడీతో ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఇవ్వడంతోపాటు, సొంత స్థలం ఉన్నవారికి ఇండ్లు నిర్మించుకోవడానికి బెనిఫీషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ పేరిట రూ.3లక్షల చొప్పున సహాయం అందజేయనున్నట్టు బడ్జెట్లో ప్రకటించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ప్రగతిపద్దులో రూ.12,000 కోట్లు, నిర్వహణ పద్దులో రూ.9.7 కోట్లు కేటాయించారు. ప్రగతి పద్దులో పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి రూ.2,272 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణానికి రూ.9,797 కోట్లు కేటాయించారు.