హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో బహుజనులు ఏకం కాకుండా ఉండేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్రలకు తెర తీశాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ ఆరోపించారు.
శనివారం బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుల విసృ్తతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కనుమరుగైన జనసేన, టీడీపీలను తిరిగి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు.