సంగారెడ్డి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా నరికి చంపారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని రాయికోడ్ మండలం నల్లంపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం మోతికే కృష్ణ(30) హత్యకు గురయ్యాడు. బాధితుడు వృత్తిరీత్యా ఆటోడ్రైవర్ పని చేస్తున్నాడు. కృష్ణకు గ్రామంలోని ప్రత్యర్థులతో గొడవలు జరిగినట్లు సమాచారం. హత్యలో వీరి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.