హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): తరతరాలుగా వెట్టిచాకిరి చేస్తున్న వీఆర్ఏలకు సీఎం కేసీఆర్ విముక్తి కల్పించారని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తెలిపారు. 20,555 మందికి పేస్కేల్ వర్తింపజేసిన సందర్భంగా సంఘం తరఫున ధన్యవాదాలు తెలిపారు. కనీస వేతనాల బోర్డు సలహా మండలి చైర్మన్ పీ నారాయణ సైతం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.