జగిత్యాల : పేపర్ లీకేజీ(Paper leakage)కి పాల్పడుతూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్(MP Bandi Sanjay) దిష్టిబొమ్మను బీఆర్ఎస్వీ(Brsv) విభాగం విద్యార్థులు దహనం చేసి నిరసన తెలిపారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రాఘవపేట గ్రామం పదవ తరగతి పరీక్షా కేంద్రం వద్ద బండి సంజయ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బీఆర్ఎస్వీ నాయకులు(Brsv) బైరి రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ తమ స్వార్ధ రాజకీయాల కోసం అభం శుభం తెలియని పదవ తరగతి విద్యార్థుల జీవితాలతో సంజయ్ చెలగాటం ఆడుతున్నాడని ఆరోపించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి చిల్లర పనులకు పాల్పడిన అతడిపై అనర్హత వేటు వేసి పీడీ యాక్ట్(PD case) కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు నత్తి నర్సయ్య, బైరి రాకేశ్ , బీఆర్ఎస్వీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎడ్ల వెంకట్, సూర మహేశ్, ఒల్లెపు కళ్యాణ్,బైరి శేఖర్,రాజుకుమార్,ముండలమహేష్,జాడి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.