హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వ మోసం బట్టబయలైందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ ఒక ప్రకటనలో విమర్శించారు. నిరుద్యోగులకు నెలకు రూ.4,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని యూత్ డిక్లేరేషన్ సభలో స్వయంగా ప్రియాంకాగాంధీ ప్రకటించారని, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార తాము అలాంటి ఏ హామీ ఇవ్వలేదని అసెంబ్లీలో ప్రకటించడం కాంగ్రెస్ మాట తప్పే నైజానికి నిదర్శమని పేర్కొన్నారు.
ఉద్యోగాల నియామకాలపై స్పష్టమైన ప్రకటన చేయకుండా శ్వేతపత్రాల పేరుతో పాలనను తప్పుదోవ పట్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీతోపాటు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.