హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తె లంగాణ) : ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చే స్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని నేడు డీఈవో ఆఫీస్ల వద్ద నిరసన చేపడుతున్నట్లు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ వి ద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నారని, ప్రైవేట్ విద్యాసంస్థలు యథేచ్ఛగా అధి క ఫీజులు వసూలు చేస్తున్నా మౌనంగా ఉండటం వల్ల ఫీజుల దోపిడీకి లైసెన్స్ తీసుకున్నట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఫీజు నియంత్రణ చట్టం తెస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచినా చట్టం తేకుండా ప్రైవేట్ సూళ్లకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారని ఆగ్ర హం వ్యక్తంచేశారు. ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు.