హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ భవన్లో శనివారం బీఆర్ఎస్వీ గ్రేటర్ హైదరాబాద్ సమావేశం నిర్వహించనున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టు తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్వీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.