BRSLP | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ మెయింటెనెన్స్ను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. అసెంబ్లీలో ఉన్న ఆయా పార్టీల ఎల్పీ కార్యాలయాల నిర్వహణను పట్టించుకోవడం లేదు. తాజాగా బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం పైకప్పు పెచ్చులూడి కిందపడిపోయింది. ఈ సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
గత సంవత్సరం నుండి ఆర్ అండ్ బీ అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్న బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం సిబ్బంది పేర్కొంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలను కనీసం కూడా మెయింటెనెన్స్ చేయడం లేదని ఆరోపించారు.
అసెంబ్లీ మెయింటెనెన్స్ను గాలికి వదిలేసిన ప్రభుత్వం
బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో పెచ్చులూడి కిందపడ్డ పైకప్పు
ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
గత సంవత్సరం నుండి ఆర్&బీ అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్న బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం సిబ్బంది… pic.twitter.com/P0gIHEXZ9w
— Telugu Scribe (@TeluguScribe) September 20, 2025