ఏపీలో పార్టీ విస్తరణపై చర్చించినట్టు సమాచారం
హైదరాబాద్/ బంజారాహిల్స్ జనవరి 3 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావుతో బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ భేటీ అయ్యారు. చంద్రశేఖర్తోపాటు బీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి రావెల కిశోర్బాబు, పార్థసారథి తదితర నేతలు కేకేను మంగళవారం బంజారాహిల్స్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలతో పాటు బీఆర్ఎస్ విస్తరణ తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తోట చంద్రశేఖర్తో పాటు ఇతర నేతలను కేశవరావు అభినందించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ దేశంలో సంచలనం సృష్టించడం ఖాయమని కేశవరావు పేర్కొన్నారు. ఈ భేటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్ కుమార్ ఉన్నారు.