KTR | హైదరాబాద్ : నిన్న హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసిన సంగతి తెలిసందే. ఈదురుగాలుల బీభత్సానికి భారీ వృక్షాలు నేలకొరిగాయి. హోర్డింగ్లు విరిగిపడ్డాయి. రేకుల షెడ్లు ఎగిరిగిపోయాయి. అయితే మియాపూర్ పరిధిలోని హఫీజ్పేటలోని సాయినగర్లో భారీ గాలులకు ఓ రేకుల ఇల్లులో ప్రమాదం జరిగింది. పక్కనున్న ఇంటి నుంచి ఇటుకలు ఎగిరిపడడంతో రేకులు పగిలిపోయాయి. ఇటుకలు ఇంట్లో ఉన్న నాలుగేండ్ల బాలుడు సమద్పై పడిపోయాయి. దీంతో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సమద్ కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. సమద్ కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు కేటీఆర్. గాలి వానలకు జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ స్థానికులకు సూచించారు.
వర్షంతో రేకులు కూలి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి సమద్ (3) కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ https://t.co/P0XxECbIoX pic.twitter.com/riTq2faBon
— Telugu Scribe (@TeluguScribe) May 27, 2024