KTR | హైదరాబాద్ : దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ముంబై ఐఐటీలో 36 శాతం మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్ పొందలేకపోయారని ఇటీవల వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. దేశంలో నిరుద్యోగంపై చర్చ జరగాలి. ప్రఖ్యాత ఐఐటీ గ్రాడ్యుయేట్లకు కూడా ఉద్యోగాలు లేవు. దేశంలో నిరుద్యోగానికి ఇది నిదర్శనం కాదా..? కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్న ఈ కీలక సమయంలో నిరుద్యోగంపై చర్చ జరగాలి. ప్రపంచంలోనే యువరక్తం అధికంగా ఉన్న దేశం మనది. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగమే అని కేటీఆర్ పేర్కొన్నారు.
If the famed IIT graduates are having a hard time getting placed, isn’t it a telling sign of unemployment in the country?!
Isn’t this the most important issue we (as a nation with largest number of youngsters on the planet) should be discussing especially as we are about to… pic.twitter.com/TjMjU23kHo
— KTR (@KTRBRS) April 10, 2024
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పేరుతో దేశవ్యాప్తంగా ఐఐటీలు ఉన్న విషయం తెలిసిందే. ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐటీ తప్పకుండా ఉంది. ఐఐటీల తరువాతి స్థానం ఎన్ఐటీలది. ఇవి కూడా జాతీయ సంస్థలే. అత్యున్నత ప్రమాణాలతో భవిష్యత్ ఇంజనీర్లను అన్ని రంగాల్లో తయారు చేస్తుంటాయి. అందుకే ఐఐటీ లేదా ఎన్ఐటీ అంటే క్రేజ్ ఎక్కువ. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ పరీక్షల ద్వారా వీటిలో అడ్మిషన్లు లభిస్తాయి. ఐఐటీలో చదివాడంటే ఆ విద్యార్ధి ఇక జెమ్ అని అర్ధం. లక్షల్లో జీతాలిచ్చే ఉద్యోగాలు చదువు పూర్తికాకుండానే ఆఫర్లు వచ్చేస్తుంటాయి. కానీ గత కొద్దికాలంగా పరిస్థితి మారుతోంది.
దేశంలోని ఐఐటీల్లో టాప్ ర్యాంకింగ్ సంస్థల్లో మద్రాస్ ఐఐటీ, బొంబే ఐఐటీ, ఖరగ్పూర్ ఐఐటీ, ఢిల్లీ ఐఐటీ. కాన్పూర్ ఐఐటీలు చెప్పుకోదగ్గవి. బోంబే ఐఐటీ అంటే చాలు ప్రముఖ కంపెనీలు ముందే వచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తుంటాయి. పోటీ పడి మరీ జాబ్ ఆఫర్లు వస్తుంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. బోంబే ఐఐటీలో కూడా పూర్తిగా ప్లేస్మెంట్స్ లభించడం లేదు.