KTR | హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ నేతలకు మతి భ్రమించినట్లుంది. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకున్న బీజేపీ నాయకులకు మతిమరుపు ఎక్కువై పోయినట్లుంది. అసలు వారు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అడ్డంగా బుక్కవుతున్నారు. సోషల్ మీడియాలో నవ్వుల పాలవుతున్నారు బీజేపీ నాయకులు.
సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ మన దేశ ప్రధానులని ఓ ఇద్దరు బీజేపీ లీడర్స్ పేర్కొన్నారు. వీరి అజ్ఞానానికి దేశ ప్రజలందరూ నివ్వెరపోతున్నారు. ఇక ఆ ఇద్దరు బీజేపీ లీడర్స్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నార్త్కు చెందిన ఓ బీజేపీ అభ్యర్థేమో సుభాష్ చంద్రబోస్ మన దేశ ప్రథమ ప్రధాని అని అంటారు. దక్షిణాదికి చెందిన మరో బీజేపీ నాయకుడేమో మహాత్మాగాంధీ మన దేశ ప్రధాని అని చెప్పుకొచ్చారు. ఇలాంటి వారంతా ఎక్కడ డిగ్రీలు చేశారని వ్యంగ్యంగా ప్రశ్నించారు కేటీఆర్.
భారతదేశ ప్రథమ ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని ఓ టీవీ ఇంటర్వ్యూలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ పేర్కొన్నారు. మరో బీజేపీ ఎంపీ అభ్యర్థి కే అన్నామలై ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ మన దేశ ప్రధాని అని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలను విన్న నెటిజన్లు వీరిద్దరూ వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ ఇద్దరు నేతలు మాట్లాడిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Whatsapp University students😁👇
Subhash Chandra Bose was the first Prime Minister of India – BJP candidate Kangana Ranaut.
Mahatma Gandhi was out Prime Minister – BJP candidate K. Annamalai pic.twitter.com/WmuT0sqcez
— Enugu Bharath Reddy (@BharathReddyBRS) April 5, 2024