KTR | హైదరాబాద్ : నిన్న ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతిపై అత్యాచారయత్నం జరిగిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అత్యాచాయత్నం నుంచి తనను తాను రక్షించుకునేందుకు ఓ యువతి ఎంఎంటీఎస్ రైలు నుంచి కిందకు దూకాల్సి వచ్చిందన్నారు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ ఘటనపై త్వరగా విచారణను పూర్తి చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు కేటీఆర్ అభ్యర్థించారు. తెలంగాణ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా బాధితురాలికి అన్ని విధాలా అండగా ఉండాలన్నారు. ఈ ఘటన రైల్వే పోలీసుల పరిధిలో ఉన్నప్పటికీ.. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మేల్కొలుపు లాంటిది అని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.
A young girl had to jump off a moving MMTS train to save herself from a rape attempt in Hyderabad! Truly shocking and unsettling to hear this news
I request Railway Minister @AshwiniVaishnaw Ji to direct the Railway police to ensure speedy investigation. The Telangana police and…
— KTR (@KTRBRS) March 24, 2025