KTR | లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్గాంధీ.. మీరు భూసేకరణ వ్యతిరేక స్వరం వినిపిస్తే ఏం లాభమని ప్రశ్నించారు. అదానీ-అంబానీలపై విరుచుకుపడితే ఏం లాభమని నిలదీశారు.
దేశవ్యాప్తంగా భూసేకరణపై మీ రణ గర్జన తెలంగాణలో భూసేకరణను ఎందుకు అడ్డుకోలేకపోయిందని కేటీఆర్ నిలదీశారు. కొడంగల్ రైతుల కన్నీటికి ఎందుకు కారణభూతమైందని ప్రశ్నించారు. అదానీ -అంబానీలపై మీ జంగ్.. రామన్నపేటలో అదానీ ఫ్యాక్టరీకి ద్వారాలు ఎందుకు తెరిచిందని అడిగారు. తెలంగాణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమే కదా.. ఎందుకు అభ్యంతరం చెప్పలేదని మండిపడ్డారు.
నేను కొట్టినట్లు చేస్తా… నువ్వు ఏడ్చినట్లు చేయి అనే ఒప్పందమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమ్మక్కు రాజకీయంలో ఇదో రహస్యమా అని అడిగారు. రేవంత్ – అదానీలతో వ్యాపార బంధమా అని ప్రశ్నించారు. అదానీ – అంబానీలపై మీ పోరాటం ఓ భూటకమని.. తెలంగాణకు కాంగ్రెస్ తరతరాల దరిద్రమని మండిపడ్డారు.
రాహుల్ గాంధీ గారూ…
మీరు భూసేకరణ వ్యతిరేక స్వరం వినిపిస్తే ఏం లాభం?అదాని – అంబానీలపై విరుచుకుపడితే ఏం ప్రయోజనం?
దేశవ్యాప్తంగా భూసేకరణపై మీ రణ గర్జన…
తెలంగాణలో భూసేకరణను ఎందుకు అడ్డుకోలేకపోయింది?
కొడంగల్ రైతుల కన్నీటికి ఎందుకు కారణభూతమైంది?అదాని -అంబానీలపై మీ జంగ్..… pic.twitter.com/b6NuJ6MIHl
— KTR (@KTRBRS) November 17, 2024