13 నెలలుగా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులను పండబెట్టి, తన వైఫల్యాన్ని గత ప్రభుత్వంపైకి నెట్టాలని సీఎం రేవంత్రెడ్డి నీచానికి దిగడం అత్యంత దుర్మార్గం. కనీస ప్రణాళిక లేకుండా పనులు మొదలుపెట్టి, 4 రోజులు కాకముందే 8 మంది అమాయకుల నిండు ప్రాణాలను బలిగొన్న పాపం ముఖ్యమంత్రిదే..
హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ ) : కాంగ్రెస్ సర్కారు వల్ల డ్యామేజీ అయిన ఎల్ఎస్బీసీ సొరంగంపై రేవంత్రెడ్డి డైవర్షన్ కుట్రలకు పాల్పడుతున్నారని, చైతన్యవంతమైన తెలంగాణ గడ్డపై ఈ కుట్రలు ఎప్పటికీ సాగవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. సొరంగం ప్రమాదంపై సీఎం రేవంత్రెడ్డి దుర్మార్గ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్ఎల్బీసీలో సెంటీమీటర్ కూడా తవ్వకపోగా, 11.5 కిలో మీటర్ల సొరంగాన్ని పూర్తిచేసిన బీఆర్ఎస్ పాలనపై రేవంత్ నిందలు వేయటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ సొరంగం విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను సోమవారం ఎక్స్వేదికగా తీవ్రంగా ఖండించారు. మొత్తం సొరంగం 43.94 కిలోమీటర్లయితే, 2005-2014 వరకున్న గత కాంగ్రెస్ సరారు హయాంలో తవ్వింది కేవలం 22.89 కిలోమీటర్లేనని, సొరంగంలో క్లిష్టమైన పరిస్థితులున్నా ఏ ప్రమాదం జరగకుండా ఏకంగా 12 కిలోమీటర్ల మేర టన్నెల్ పనులను పూర్తిచేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని వివరించారు.
నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బీసీ పనులకు రూ.3300 కోట్ల ఖర్చుచేస్తే, బీఆర్ఎస్ హయాంలో రూ.3900 కోట్లతో పనులు పూర్తిచేసిన వాస్తవాన్ని దాచే ప్రయత్నంలో ముఖ్యమంత్రి బొకబోర్లా పడ్డారని ఎద్దేవాచేశారు. గత కాంగ్రెస్ సరారు కన్నా రూ.600 కోట్లు ఎకువ ఖర్చుచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లడం కాంగ్రెస్ సర్కార్ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మూడున్నరేండ్లలోనే 203 కిలోమీటర్ల టన్నెళ్లు తవ్వినా, ఎస్ఎల్బీసీ వంటి దారుణ సంఘటన జరిగిన దాఖలా లేదని గుర్తుచేశారు. రైతులకు నీళ్లిచ్చే ప్రాజెక్టులను కాకుండా గల్లీ నుంచి ఢిల్లీదాకా కమీషన్లు ఇచ్చే ప్రాజెక్టులను చేపట్టి వాటిని అర్ధాంతరంగా గాలికి వదిలేసే నీచ చరిత్ర కాంగ్రెస్దేనని ఫైర్ అయ్యారు. చేసిన తప్పును ఒప్పుకోవడం తప్ప సీఎంకు మరో మార్గం లేదేని, ‘డ్యామేజ్ డైవర్షన్’ కుట్రలు చైతన్యవంతమైన తెలంగాణ గడ్డపై ఎప్పటికీ సాగవని హెచ్చరించారు.
కరోనా కన్నా డేంజరెస్ వైరస్ కాంగ్రెస్ అని కేటీఆర్ విమర్శించారు. ఏడాది క్రితం తాము చెప్పింది నేడు అక్షరాలా నిజమైందని, రాష్ట్ర అభివృద్ధిని అసమర్థ సీఎం గొ య్యితీసి పాతరేశారని ధ్వజమెత్తారు. దేశంలోనే అగ్రభాగాన ఉన్న తెలంగాణను ఆఖరు స్థానానికి పడేశారని ఆవేదన వ్యక్తంచేశారు. నిరుడు 10 శాతం నమోదైన జీఎస్టీ వసూళ్లు కేవలం ఒకశాతం వృద్ధికి పడిపోవటం సిగ్గుచేటని పేర్కొన్నారు. దారీతెన్నూలేని చెత్త నిర్ణయాలతోనే ఈ పతనమని విమర్శించారు. ప్రభుత్వ పెద్దల కమీషన్లు ఆకాశానికి అంటుతుంటే రాష్ట్రప్రగతి పాతాళానికి పడిపోతున్నదని ధ్వజమెత్తారు. రాష్ట్ర రాబడులు కుప్పకూలడం క్షమించరాని నేరమని, కేసీఆర్ హయాంలో వెలుగొందిన స్వర్ణయుగాన్ని చెరిపేసి సీఎం రాసుకునే చీకటి చరిత్ర ఇదేనా? అని నిప్పులు చెరిగారు.