KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీటి కష్టాలు మొదలయ్యాయి. గత ఐదారు నెలల నుంచి రైతుల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సాగునీరు లేక పంటలు ఎండిపోయాయి. పోని పండిన పంటలను కూడా కొనేందుకు ప్రభుత్వం ముందుకురాలేదు. దాంతో అకాల వర్షాలకు పంట తడిసిపోయింది. చివరకు మిగిలిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనే దిక్కు లేదు. ఇక ఖరీఫ్ సీజన్లో వేసే పంటలకు సంబంధించిన విత్తనాల కోసం రైతులు సీడ్ షాప్సు ముందు బారులు తీరుతున్నారు. విత్తనాల కోసం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతుల బాధలపై ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అని ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు..? అని నిలదీశారు. వ్యవసాయ పరిస్థితులను పర్యవేక్షించాలని వ్యవసాయ మంత్రి ఎక్కడ..? ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది..? అని నిలదీశారు కేటీఆర్. నిన్న.. ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు..! నేడు.. విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు..!! పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి.. ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలని కేటీఆర్ పేర్కొన్నారు.
తెల్లవారుజామున 4 గంటలకు లైన్లో నిలబడితే.. సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు ఇవ్వలేరా..? గత పదేళ్లపాటు.. 10 నిమిషాల్లో అందిన విత్తనాలు.. ఇప్పుడు 10 గంటల పాటు పడిగాపులు పడినా అందించలేరా ?? అని నిలదీశారు కేటీఆర్. దేశం కడుపునింపే స్థాయికి ఎదిగిన తెలంగాణ.. అన్నదాతకే తిండితిప్పలు లేకుండా చేస్తారా ?? కాంగ్రెస్ వచ్చింది.. కాటగలిసినం అంటున్న.. అన్నదాతలను ఇంకా అరిగోస పెట్టకండి..!! లేకపోతే.. రైతుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని.. కాంగ్రెస్ ప్రభుత్వం చవిచూడక తప్పదు..!! అని కేటీఆర్ హెచ్చరించారు.
రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..?
విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు ??
పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ ?
ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది ??ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప..
ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా ??నిన్న.. ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు… pic.twitter.com/f22DOOMMDM
— KTR (@KTRBRS) May 29, 2024