కొత్తూరు, ఆగస్టు 4 : సిద్దాపూర్లో డంపింగ్ యార్డు ఏర్పాటులో పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదముందనే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక రూపంలో అందిస్తామని ైక్లెమేట్ ఫ్రంట్ స్టీరింగ్ కమిటీ సభ్యులు రుచిత్ ఆశా కమల్ అన్నారు. డింపింగ్ యార్డు వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు రాంబల్నాయక్ ఆధ్వర్యంలో సిద్దాపూర్ డింపింగ్ యార్డు ప్రతిపాదిత భూమిని, సిద్దాపూర్, కుల్చర్లకుంట తండా ప్రజలను ైక్లెమేట్ ఫ్రంట్ స్టీరింగ్ కమిటీ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసులు తమను అడ్డుకునే ప్రయత్నం చేశారని వారు పేర్కొన్నారు.
ప్రజలను ఉద్దేశించి రుచిత్ ఆశా కమల్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం తమ సంస్థ పనిచేస్తున్నదన్నారు. ప్రజలకు, పర్యావరణానికి దేశంలో ఎక్కడ ముప్పు ఏర్పడితే క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం నిర్వహిస్తున్నామన్నారు. వాస్తవాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక రూపంలో అందిస్తామన్నారు. సిద్దాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు రాంబల్నాయక్ మాట్లాడుతూ.. సిద్దాపూర్ సమస్యను గుర్తించి ైక్లెమేట్ ఫ్రంట్ స్టీరింగ్ కమిటీ సభ్యులు రావడం తమ ఉద్యమానికి బలాన్ని చేకూర్చిందన్నారు.
461 జీవో రద్దయ్యే వరకు అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ైస్టీరింగ్ కమిటీ సభ్యులు రావడంపై తమ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు తెలిసిందన్నారు. కార్యక్రమంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు అన్సారీ, అరుణజ్యోతితో కలిపి ఎనిమిది మంది సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జేఏసీ సభ్యులు బాలయ్య, శ్రీనివాస్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, రెడ్యానాయక్, నరేశ్నాయక్, గిరిజనులు, గ్రామస్తులు పాల్గొన్నారు.