హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం, మత్స్యరంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ధిశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. రాష్ట్రంలో మత్స్యరంగ అభివృద్ధి కోసం జిల్లా మత్స్యసహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో మంగళవారం మంత్రి శ్రీహరి మినిస్టర్స్ క్వార్టర్స్లో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 వేల చెరువులు, 100 రిజర్వాయర్లలో చేపల పెంపకాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మత్స్యకారులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ కొహెడలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫిష్ మారెట్ పూర్తయిన తర్వాత ఆన్లైన్ ద్వారా చేపల విక్రయాలు, పంపిణీకి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.