KTR | కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక నేతన్నలు, చేనేతలపై కక్ష గట్టి వారి ప్రాణాలు తీస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నేతన్నలు, చేనేతల ఆత్మహత్యలు నివారించి వారికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించామని తెలిపారు. ఏడేండ్ల పాటు కొనసాగిన ఈ బతుకమ్మ చీరల ఆర్డర్ల కారణంగా రాష్ట్రంలో చేనేతలు, నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోయాయని గుర్తు చేశారు. ఏటా రూ. 350 కోట్ల బడ్జెట్తో బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కోటి చీరలను పంపిణీ చేసేదని కేటీఆర్ గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేయాలని కుట్ర చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ సదుద్దేశంతో చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కారణంగా పేద మహిళలకు పండుగ పూట ప్రభుత్వ కానుకగా చీర అందేదన్నారు. అదే విధంగా చేనేత కార్మికులు, నేతన్నలు అనుబంధంగా ఎంతో మంది ఉపాధి పొందేవారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని సూచించారు.
బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేసిన కారణంగా ఇప్పటికే 10 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత చర్యలు మాని వెంటనే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి నేతన్నలు, చేనేతలకు ఉపాధి కల్పించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
The Congress government has sounded another death knell for weavers
Leaving poor weavers in distress, the government has decided to halt the distribution of Bathukamma Sarees, a tradition the BRS government practiced for 7 years
Every year, the BRS government distributed around… pic.twitter.com/57ShqOR6mf
— KTR (@KTRBRS) July 9, 2024