KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. హద్దుమీరిన అబద్దాలతో ఇంకా ఎన్నిసార్లు మభ్య పెట్టాలని చూస్తారు అని కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి గారు.. 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని మీరే మొన్న చెప్పారు. కాగ్నిజెంట్ కంపెనీని తెచ్చామని మీరే నిన్న చెప్పారు. సీతారామ ప్రాజెక్టును మీరే కట్టామని నేడు అంటున్నారు. మా కష్టాన్ని ఎన్నిసార్లు మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తారు. హద్దుమీరిన అబద్ధాలతో.. ఇంకా ఎన్నిసార్లు మభ్యపెట్టాలని చూస్తారు. మీరు శ్రీకారం చుట్టి.. మీరే లక్ష్యాన్ని చేర్చిన నాడు.. అది మీ సమర్థతకు ప్రతీక అవుతుంది. అంతే తప్ప.. బీఆర్ఎస్ సర్కారు క్రెడిట్ను కొట్టేసే ప్రయత్నం మీరు ఎంత చేసినా నాలుగు కోట్ల ప్రజానీకం మాత్రం నమ్మదు. తెలంగాణ సమాజం ఎప్పటికీ విశ్వసించదు అని కేటీఆర్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి గారు..
మొన్న…
30 వేల ఉద్యోగాలు మీరే ఇచ్చారన్నారునిన్న…
కాగ్నిజెంట్ కంపెనీని మీరే తెచ్చామన్నారునేడు…
సీతారామ ప్రాజెక్టును మీరే కట్టారంటున్నారుమా కష్టాన్ని ఎన్నిసార్లు..
మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తారుహద్దుమీరిన అబద్ధాలతో..
ఇంకా ఎన్నిసార్లు…— KTR (@KTRBRS) August 16, 2024
ఇవి కూడా చదవండి..
KTR | అక్కచెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు : కేటీఆర్
Sanke | బీర్ టిన్లో ఇరుకున్న పాము..
Vikarabad | కొడుకు ఆచూకీ చెప్పాలని దళిత మహిళకు వేధింపులు