సిరిసిల్ల టౌన్/గంభీరావుపేట/ఎల్లారెడ్డిపేట, మే 18: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
సిరిసిల్ల పట్టణంతోపాటు ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరయ్యారు. పలుచోట్ల యువతీయువకులు కేటీఆర్తో సెల్ఫీలు తీసుకున్నారు. చిన్నారులతో కలిసి వచ్చిన దంపతులు సైతం కేటీఆర్తో కలిసి ఫొటోలు దిగారు. గంభీరావుపేట మండ లం కోళ్లమద్దిలో మల్లికార్జునస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని పూజలుచేశారు. అనంతరం పెద్దమ్మ ఆలయాన్ని సందర్శించారు.