BRS Party | హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా సమన్వయ కర్తలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. నాగర్కర్నూల్ ఎంపీ స్థానం సమన్వయకర్తగా రంగినేని అభిలాష్రావు, మహబూబ్నగర్ ఎంపీ స్థానం సమన్వయకర్తగా ఆశప్రియ ముదిరాజ్ను నియమించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. ఇక నాగర్కర్నూల్ ఎంపీ స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మహబూబ్నగర్ ఎంపీ స్థానం నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డికి కేసీఆర్ టికెట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.