హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి స్ఫూ ర్తితో రాబోయే రోజుల్లో దేశంలో మార్పు కోరుకొందామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. దేశ ప్రజలు స్వావలంబన సాధించేలా అడుగులేద్దామని పిలుపునిచ్చారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మారుస్తున్న ట్టు అక్టోబర్లో విజయదశమి పర్వదినాన సీఎం కేసీఆర్ ప్రకటించగా, గురువారం కేం ద్ర ఎన్నికల సంఘం పార్టీ పేరు మార్పును ధ్రువీకరించడం సంతోషకరమని పేర్కొన్నారు.
ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి ప్రజా పోరాటాలతో స్వరాష్ట్ర గమ్యాన్ని చేరి మూడున్నర కోట్ల మంది ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా చరిత్రలో నిలిచిపోయిందని గురువారం ఆయన ట్వీట్ చేశారు. ఇది దేశంలో మార్పు తేవాలని సీఎం కేసీఆర్ తలపెట్టిన మహా యజ్ఞమని అన్నారు. రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు.