దేశంలో రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా మహారాష్ట్రలోనే జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలు ఆగిపోయాయి. మహారాష్ట్ర సర్కారు తెలంగాణ మాడల్ను అమలు చేయకపోతే త్వరలో అక్కడ ఏర్పడే బీఆర్ఎస్ సర్కారే నూటికి నూరుపాళ్లు అమలు చేస్తుంది.
– మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలకు అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. అనేక మంది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా బీజేపీ సర్కారు కనీసం స్పందించటంలేదని మండిపడ్డారు. మహారాష్ట్ర రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీది ప్రజల టీం అని, ఏ పార్టీకి బీ టీంగా ఉండాల్సిన అవసరం, అగత్యం తమకు లేదని స్పష్టం చేశారు. బుధవారం మహారాష్ట్రలోని సోలాపూర్లో పద్మశాలీల ఆరాధ్యదైవం మార్కండేయ రథోత్సవంలో హరీశ్రావు పాల్గొన్నారు. మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలు ఏయే టీంలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయో ప్రజలకు బాగా తెలుసని అన్నారు. రైతులపై మహారాష్ట్ర సర్కారుకు నిజమైన ప్రేమ ఉంటే ముందుగా ఆత్మహత్యలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ఆత్మహత్యలు దేశాన్ని కుదిపేస్తున్నా సర్కారుకు చీమకుట్టినట్టయినా లేదని విమర్శించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరిస్తున్నకొద్దీ అక్కడి రాజకీయ పార్టీల నేత ల్లో అసహనం పెరుగుతున్నదని, అందుకే బీఆర్ఎస్ను కాంగ్రెస్కు బీ టీం అని, బీజేపీకి బీ టీం అని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. ఒక పార్టీకి అంటకాగాల్సిన అవసరం తమ పార్టీ అధినేత కేసీఆర్కు లేదని స్పష్టంచేశారు. తమది రైతులు, మహిళలు, యువకులు, పీడితుల టీం అని మంత్రి తేల్చి చెప్పారు.
దేశంలో రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా మహారాష్ట్రలోనే జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని హరీశ్రావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడ రైతుల ఆత్మహత్యలు ఆగిపోయాయని తెలిపారు. వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగిందని అన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్, సమయానికి ఎరువులు, విత్తనాల సరఫరా, పుష్కలమైన సాగునీరు, రైతు రుణమాఫీ వంటి చర్యలతో తెలంగాణ రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. మహారాష్ట్ర సర్కారు తెలంగాణ మాడల్ను అమలు చేయకపోతే త్వరలో అక్కడ ఏర్పడే బీఆర్ఎస్ సర్కారే నూటికి నూరుపాళ్లు అమలు చేస్తుందని తెలిపారు. మహారాష్ట్రలోని అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ను ఆదరిస్తున్నారని, త్వరలో సీఎం కేసీఆర్ సోలాపూర్లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారని చెప్పారు. సభా నిర్వహణ కోసం అనువైన స్థలాలను తాము పరిశీలించామని చెప్పారు.
సోలాపూర్లోని మార్కండేయ ఆలయ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ తోడ్పాటును అందిస్తుందని మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. ఆల య అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ రూ.1 కోటి సా యంగా అందిస్తుందని ప్రకటించారు. వందేండ్లుగా కొనసాగుతున్న మార్కండేయ రథోత్సవంలో పాల్గొనడం తమకు గొప్ప అనుభూతిని కలిగించిందని అన్నారు. హరీశ్రావు వెంట ఎమ్మెల్సీ ఎల్ రమణ, మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జి కల్వకుంట్ల వంశీధర్రావు, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఉన్నారు. తొలుత హరీశ్రావు బృందానికి సోలాపూర్లో ఘనస్వాగతం లభించింది. హరీశ్రావు ఎడ్ల బండిపై ఎక్కి మార్కండేయ స్వామికి భారీ మాలను సమర్పించారు. సోలాపూర్వాసులకు రాఖీ శుభాకాంక్షలు చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ సోలాపూర్లో త్వరలో భారీబహిరంగ నిర్వహించనున్న నేపథ్యంలో మంత్రి హరీశ్రావు బాల్కోఠి మైదానం, ఈద్గా మైదానాన్ని పరిశీలించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింలకు అద్భుత పథకాలు అమలుచేస్తున్నదని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. సోలాపూర్లోని మసీదులో ఆయన బుధవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా షరీఫ్లో అలీ ఫతిహా ఖవా నీ చదివారు. తెలంగాణలో ఉన్నది సెక్యులర్ ప్రభుత్వమని, అన్ని వర్గాల సం క్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతున్నదని తెలిపారు. ప్రతి ఇంటికి పథకం అందుతున్నదని చెప్పారు.