నమస్తే తెలంగాణ న్యూస్నెట్వర్క్, ఏప్రిల్ 12: సమాజంలోని సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న బీఆర్ఎస్ సారథ్యంలోనే దేశానికి ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనాలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్పర్సన్లు, నాయకులతోపాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. బుధవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్ర శివారు, కిష్టాపురం క్రాస్ రోడ్డులో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనతో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాతే మన బతుకులు బాగుపడ్డాయని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్లో నిర్వహించిన సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. 60 ఏండ్లలో సాధించని అభివృద్ధిని తొమ్మిదేండ్లలోనే సాధించినట్టు తెలిపారు.
మంచిర్యాల జిల్లా జైపూర్లో నిర్వహించిన 20 గ్రామాల ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, మంచిర్యాల జిల్లా ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావు, జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, మాజీ ఎమ్మెల్యేలు గడ్డం అరవిందరెడ్డి, నల్లాల ఓదెలు పాల్గొన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం కొండేరులో ఎమ్మెల్యే అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మంద జగన్నాథం, జెడ్పీ చైర్పర్సన్ సరిత, నియోజకవర్గ మాజీ ఇన్చార్జి మంద శ్రీనాథ్ హాజరయ్యారు.
నల్లగొండ జిల్లా చిట్యాల, చండూరు మండలాల కార్యకర్తల సమ్మేళనాలు నిర్వహించారు. ఆయా సమ్మేళనాల్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి పాల్గొన్నారు.ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడులో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ తాతా మధు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు హాజరయ్యారు.