భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన సీపీఐతోపాటు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బుధవారం పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకుడు కిలారు ప్రసాద్తోపాటు పాత కొత్తగూడేనికి చెందిన సుమారు వంద మంది వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొన్నారు.