హైదరాబాద్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ (BRS) పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. గతకొంత కాలంగా ఇరువురు నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో సస్పెండ్ చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆదేశాలతో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ప్రకటించింది.