ఆదిలాబాద్ : బీఆర్ఎస్ పార్టీ(BRS)ని విస్తరించే కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర (Maharastra)లో బీఆర్ఎస్కు అనూహ్య స్పందన వస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న(Mla Jogu Ramanna) అన్నారు. శుక్రవారం జిల్లాలోని బేల మండలం సదల్పూర్ లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. మహారాష్ట్ర ప్రజలు తమకు తెలంగాణ పథకాలు కావాలని కోరుతున్నారని పేర్కొన్నారు . మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు ప్రజల మద్దతు రోజు రోజుకు పెరుగుతుందని వెల్లడించారు.
బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించాలని సూచించారు. తెలంగాణలో బీఆర్ఎస్ మూడోసారి విజయం సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. గ్రామాల్లో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చేసిన అభివృద్ధి ప్రశ్నించాలని అన్నారు.