జగిత్యాల, జూలై 1 : రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చే యాలని బీఆర్ఎస్ రా ష్ట్ర కార్యదర్శి జీవన్రెడ్డి సీఎం రేవంత్రెడ్డికి బు ధవారం లేఖ రాశారు. బకాయిలు దాదాపు రూ.10 వేల కోట్లకు చేరాయని, కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించి విద్యార్థుల నుంచి ఫీజులు తీసుకునే విధంగా ఉత్తర్వులు పొందారని తెలిపారు. దీంతో విద్యార్థులు ఆర్థికభారం కారణంగా చెల్లించలేక, సర్టిఫికెట్లు పొందలేక అవస్థ పడుతున్నట్టు పేర్కొన్నారు. అటు ఉన్నత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడంలోనూ ఇబ్బందులు ఎదురొంటున్నారని ఆ వేదన వ్యక్తం చేశారు. కళాశాలలకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయడంతోపా టు 2026-27కు సంబంధించి విద్యా సం వత్సరంలో కళాశాలల్లో విద్యార్థులు ముందస్తుగా ప్రత్యక్షంగా ఫీజుల చెల్లింపు భారం లేకుండా చేయాలని డిమాండ్ చేశారు.