హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఉద్యమస్ఫూర్తితో ప్రజలతో మమేకమై, సమస్యలపై పోరాడాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఉద్యమ పార్టీగా ఉద్భవించిన బీఆర్ఎస్ ఎన్నో ఆటుపోట్లను ఎదురొని ప్రజాభిమానంతో పదేండ్లు సుస్థిరపాలన అందించిందని తెలిపారు.
కార్యకర్తలు నైరాశ్యానికి లోనుకావద్దని కోరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందించిన సంక్షేమ ఫలాలతోనే తమ జీవితాల్లో వెలుగులు వచ్చాయన్న భావనతో తెలంగాణ ప్రజానీకం ఉన్నారని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.