జగిత్యాల, జులై 2 (నమస్తే తెలంగాణ): బహిరంగ చర్చకు చాలెంజ్ విసిరి ఆపై మంత్రులు ముఖం చాటేయడం అలవాటుగా మారిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్రెడ్డి విమర్శించారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో గురుకులాలకు కోడిగుడ్ల నుంచి మొదలుకొని పిల్లల దుస్తుల వరకు పారదర్శకంగా సాగిందని పేర్కొన్నారు.
రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చాక గురుకులాలకు సరుకుల పంపిణీ గుజరాత్కు చెందిన వ్యాపారులకు కట్టబెట్టారని మండిపడ్డారు. అందులో అవినీతి జరిగిందని ఆధారాలు సహా ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రకటిస్తే, మంత్రులు చర్చకు సవాల్ విసిరి పారిపోయారని మండిపడ్డారు. ఒకవైపు చర్చకు రమ్మంటూ, మరోవైపు పోలీసులతో అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు.