హనుమకొండ/ఉప్పునుంతల/రాజాపేట, ఏప్రిల్ 17 : బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు సంబురంగా సాగుతున్నాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేషం చేస్తున్నారు. వారి సమస్యలను తెలుసుకొని పరిష్కార మార్గం చూపుతున్నారు. కార్యకర్తలతో కలిసి ఆడిపాడి సందడి చేస్తున్నారు. ఆపై సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. సోమవారం కూడా పలుచోట్ల ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు.
వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలోని 30,31 డివిజన్ల కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, హనుమకొండ జిల్లా ఇంచార్జి, ఎమ్మెల్సీ ప్రభాకర్రావు, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే వొడితల సతీష్బాబు, జడ్పీ చైర్మెన్ ఎం. సుధీర్కుమార్, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాద వ్, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. ముందుగా అమరులకు నివాళులర్పించి సీఎం కేసీఆర్ సందేశాన్ని కార్యకర్తలకు చదివి వినిపించారు. నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం వెల్టూర్ గేట్ సమీపంలోని ఫంక్షన్హాల్లో నిర్వహించిన సమ్మేళనంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పాల్గొన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో నిర్వహించిన సమ్మేళనంలో బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి పాల్గొన్నారు.