హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రైతులకు పెట్టుబడిసాయం విషయంలో దావోస్లో సీఎం రేవంత్చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు.
రైతు భరోసా పేరుతో రైతులకు కాంగ్రెస్ పార్టీ పెట్టుబడి సాయం అందిస్తున్నదని ముఖ్యమంత్రి చెప్పుకున్నారని, కేసీఆర్ ప్రారంభించిన రైతుబంధు పథకాన్ని తమ పథకంగా చెప్పుకోవడం సీఎం రేవంత్రెడ్డి దిగజారుడుతనానికి పరాకాష్ట అని సతీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.