గంగాధర, డిసెంబర్ 27: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన ఉజ్జినేని వంశీకృష్ణ మంగళవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ను హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఆంధ్రప్రదేశ్లో పని చేస్తానని ఆయన తెలిపారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని వినోద్కుమార్ హామీ ఇచ్చినట్టు వంశీకృష్ణ తెలిపారు. ఆయన వెంట కరీంనగర్ జిల్లా గంగాధర బీఆర్ఎస్ అధ్యక్షుడు మేచినేని నవీన్రావు తదితరులు ఉన్నారు.