హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా బీఆర్ఎస్(BRS) పార్టీ సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం మెదక్ లోక్సభ(Medak Lok Sabha) నియోజకవర్గంపై మాజీ మంత్రి హరీశ్ రావు(Harishrao) నేతృత్వంలో పటాన్చెరులో సమీక్ష ప్రారంభమైంది. ఈ సమావేశంలో మెదక్ లోక్సభ పరిధిలోని నియోజకవర్గాలకు చెందిన నేతలంతా హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల కార్యాచరణ, గెలుపు వ్యూహాలపై చర్చిస్తున్నారు.
ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, కె.సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి, గాలి అనిల్ కుమార్ తదితరులు హాజరయ్యారు.