హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా బీఆర్ఎస్(BRS) పార్టీ సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఖమ్మం లోక్సభ(Khammam Lok Sabha) నియోజకవర్గంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నేతృత్వంలో తెలంగాణ భవన్లో సమీక్ష ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఖమ్మం లోక్సభ పరిధిలోని నియోజకవర్గాలకు చెందిన నేతలంతా హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల కార్యాచరణ, గెలుపు వ్యూహాలపై చర్చిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.