మంచిర్యాల: బీఆర్ఎస్ పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం దూసుకెళ్తున్నారు. తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 7, ఆర్కే న్యూటెక్ భూగర్భ గనుల్లో సింగరేణి కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించారు.
కార్మికుల యోగ క్షేమాలు అడిగితెలుసుకున్న ఆయన.. ఎన్నికల్లో బీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు మిర్యాల రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఆయన వెంట ఉన్నారు.