వరంగల్ : పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇటీవల ప్రమాదాల్లో మరణించిన బీఆర్ఎస్ నేతల కుటుంబ సభ్యులకు పార్టీ బీమా చెక్కులను అందజేశారు. రాయపర్తి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అంబటి శ్రీనివాస్ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించగా అతడి భార్య అంబటి రమాదేవికి బీమా చెక్కును అందజేశారు.
అలాగే వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సుధగాని రమేష్ కొద్ది రోజుల క్రితం ఓ ప్రమాదంలో మరణించగా అతడి భార్య సుధకు పార్టీ బీమా చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..బీఆర్ఎస్ పాలనలోనే ప్రతి కార్యకర్తకు సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకోవడంలో పార్టీ ముందుంటుందని తెలిపారు. బాధిత కుటుంబాలకు కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా కల్పించారు.