హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం వల్ల యువత వలసబాట పట్టారని బీఆర్ఎస్ పార్టీ ఆ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో ఏపీలోని పలు జిల్లాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీ రాజధాని ఏదో చెప్పుకోలేని అయోమయ స్థితిలో రాష్ట్ర ప్రజానీకం ఉన్నదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
ఏపీలో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతున్నదని చెప్పారు. పార్టీలో చేరినవారిలో పుంగనూరుకు చెందిన రమ్య యాదవ్, పవన్, విజయవాడకు చెందిన కంది ప్రశాం త్, శరత్, కే మోహన్బాబు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రఘు వీరప్రసాద్, చీరాలకు చెందిన స్వప్నగౌడ్, అనంతపురం జిల్లాకు చెందిన సుధాకర్ సహా పలు జిల్లాల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.