Ambedkar Jayanti : భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆయనకు నివాళులు అర్పించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సెక్రెటీరియట్ సమీపంలో అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని పెట్టి, 36 ఎకరాల విస్తీర్ణంలో స్మృతివనం ఏర్పాటుచేశారు. ఇవాళ ఆ విగ్రహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నాయకులు పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. తన తండ్రి కేటీఆర్ ‘బోధించు.. సమీకరించు.. పోరాడు’ అనే అంబేద్కర్ తత్వాన్ని అనుసరించే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేశారని అన్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అనేది లేకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమయ్యేది కాదని చెప్పారు.