BRS Party | హైదరాబాద్ : వచ్చే నెల 13వ తేదీన చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశమై, లోక్సభ ఎన్నికలపై చర్చించారు.
ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన కేటీఆర్.. 13వ తేదీన కేసీఆర్ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలను తరలించి, విజయంతం చేయాలన్నారు. కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది.