BRS Party | హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ వద్దకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. బరాజ్ వద్ద గేట్లను మూసివేసి, బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు గేట్లను తోసుకుంటూ ముందుకు వెళ్లారు. మేడిగడ్డలో కుంగిన పియర్ను నేతలు పరిశీలించారు. మేడిగడ్డ పరిశీలనకు కేటీఆర్, హరీశ్రావు, కడియం శ్రీహరి, ప్రశాంత్ రెడ్డి, దయాకర్ రావు, నిరంజన్ రెడ్డితో పాటు పలువురు నాయకులు వెళ్లారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బరాజ్లపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం మేడిగడ్డ పర్యటనకు శుక్రవారం ఉదయం ప్రత్యేక బస్సుల్లో బయల్దేరారు.
Live: మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శిస్తున్న బీఆర్ఎస్ పార్టీ బృందం.#ChaloMedigadda #KaleshwaramProject https://t.co/wUTU82Cp1H
— BRS Party (@BRSparty) March 1, 2024