KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పలువురు పార్టీ నేతలు, ప్రముఖులు భేటీ అయ్యారు. హైదరాబాద్ నందినగర్లోని ఆయన నివాసానికి వెళ్లి శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, చిరుమర్తి లింగయ్య, రవీంద్ర నాయక్, ఎమ్మెల్సీ వెంకట్రాం రెడ్డి, పిర్జాదిగూడ మేయర్ జక్కావెంకట్రెడ్డి తదితర పార్టీ నేతలు కేసీఆర్ను కలిశారు. వీరితో పాటు సినీ నిర్మాత దిల్ రాజు మర్యాదపూర్వకంగా కేసీఆర్ను కలిశారు.
అలాగే సీఎం మాజీ సీపీఆర్వో వనం జ్వాలా నర్సింహారావు, సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ కూడా కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా తాము రచించిన పుస్తకాలను కేసీఆర్కు అందజేశారు.