హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్)పై అధ్యయనానికి కమిటీ నియమిస్తామని హామీ ఇచ్చింది. ఆదివారం బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ‘సీపీఎస్ పరిధిలోని ఉద్యోగులు తమకు పూర్వం ఉన్న పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని కోరుతున్నారు. దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తాం. నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం’ అని ప్రకటించారు. మ్యానిఫెస్టోలో పొందుపరచడాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు స్వాగతించాయి. రాష్ట్రంలో సీపీఎస్ ఉద్యోగుల సంఖ్య దాదాపు 2.5 లక్షలకు చేరింది. సీపీఎస్ను రద్దుచేసి పాత పెన్షన్స్కీంను అమలుచేస్తే ఆయా కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది.
సీపీఎస్ విధానంలోని ఉపాధ్యాయ, ఉద్యోగులు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. దీనిపై అధ్యయనానికి కమిటీ వేస్తామని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించడం హర్షణీయం. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. సీపీఎస్ను రద్దుచేస్తే రూ.2.5 లక్షల ఉద్యోగులు, కుటుంబాలు కలిసి మద్దతు ఇస్తాం.
సీపీఎస్తో ఉద్యోగుల కుటుంబాలు ఎన్నో అవస్థలు పడుతున్నాయి. భవిష్యత్పై భరోసా లేక ఇబ్బందులు పడుతున్నాయి. సీపీఎస్తో అరకొర పెన్షన్ అందుతున్నది. సీపీఎస్కు ప్రత్నామ్నాయం పాత పెన్షన్ విధానమే. దీనిపై అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తామనడం హర్షణీయం. సీఎం కేసీఆర్ చొరవను స్వాగతిస్తున్నాం.