KCR | హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామిక, స్వయంపాలనను అమలులోకి తెచ్చి, భారతదేశాన్ని సార్వభౌమాధికార, సర్వసత్తాక, గణతంత్ర దేశంగా నిలుపుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 ఏండ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగ నిర్మాతలకు ఈ సందర్భంగా కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాద మౌలిక విలువలను అనుసరిస్తూ, రాజ్యాంగస్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రతీఒకరం ప్రతినబూనుదామని ఆయన పిలుపునిచ్చారు.
పరాయి పాలనలో మగ్గిన భారతదేశానికి వెలకట్టలేని త్యాగాలతో సాధించుకున్న స్వేచ్ఛ, స్వాతంత్య్ర ఫలాలు ప్రతి గడపకూ చేరిననాడే రా జ్యాంగ నిర్మాతల ఆశయాలను నెరవేర్చినవారం అవుతామని కేసీఆర్ తెలిపారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలకు సమాన భాగస్వామ్యం దకే లా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ కలలుగన్న సమసమాజ సాధనకు పాలకులు మరింత కృషి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు.
కులం, మతం, ప్రాంతం, లింగం సహా ఎటువంటి వివక్ష లేకుండా మనుషులందరూ ఆత్మగౌరవంతో జీవి స్తూ సమాన హకులను పొందే దిశగా పౌరులుగా మన కర్తవ్యాలను, బాధ్యతలను నిర్వర్తిస్తూ పటిష్ఠంగా రాజ్యాంగం అమలయ్యేందుకు ప్రతీ పౌరుడు కృషి చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.