BRS Party | ఈ నెల 27 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఎల్లుండి నుంచి మొదలై ఫిబ్రవరి 10వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పూర్తి చేయేనున్నది. అసెంబ్లీ ఎన్నికల సమీక్షతో పాటు క్షేత్రస్థాయి అంశాలు, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలకు సమావేశాల నిర్వహణ బాధ్యత అప్పగించారు. 27న సిద్దిపేట, బోథ్, జూబ్లీహిల్స్, వనపర్తి, నల్గొండ.. 28న సిరిసిల్ల, వర్ధన్నపేట, మెదక్, ముషీరాబాద్, పాలకుర్తి నియోజకవర్గాల సమావేశాలు జరుగనున్నాయి. 29న ఆలేరు, నర్సంపేట, ఖైరతాబాద్, జుకల్, ఆందోల్, వికారాబాద్, జగిత్యాల నియోజకవర్గ సమావేశాలు జరుగనున్నాయి.