హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవనెత్తే ప్రజా సమస్యలు, వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకనే ప్రభుత్వం వారిని సభ నుంచి సస్పెండ్ చేసిందని ఆ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు ప్రధాన ప్రతిపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేయడం అత్యంత గర్హనీయమని బుధవారం ప్రకటనలో పేరొన్నారు. కాంగ్రెస్ సరార్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, తప్పుడు విధానాలను ప్రజాక్షేత్రంలోనే సమగ్రంగా ఎండగడతామని ఆయన స్పష్టం చేశారు.