Vinod Kumar | కరీంనగర్ : కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఐదుగురు ఎంపీలతో ఢిల్లీకి వెళ్లి తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ మినహా ఇతర పార్టీలు ఉండొద్దని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఏడేండ్లు అవుతుంది. ఇప్పటి వరకు కేంద్రం కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదు. రాష్ట్ర సమస్యలపై ఢిల్లీలో పోరాడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, నాయకుడు ఎండీ జమీలొద్దీన్ పాల్గొన్నారు.